గుంటూరు: సీపీఎస్ కమిటీపై తమకు నమ్మకం లేదని ఏపీ ఎన్జీవో సంఘం నేత అశోక్బాబు అన్నారు. సీపీఎస్ కొనసాగిస్తే ఆర్థికభారం అనేది అబద్ధమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కొన్ని సంఘాలు తమ పోరాటంపై విమర్శలు చేస్తున్నాయని అశోక్బాబు మండిపడ్డారు. పద్ధతి మార్చుకోకుంటే ఖబడ్దార్ అంటూ ఆయన హెచ్చరించారు. ఎన్డీఏకు వ్యతిరేకంగా సీఎం చంద్రబాబు మద్దతు కూడగడుతున్నారని, ఆ ఫ్రంట్లో ఉద్యోగుల సమస్యను కామన్ మినిమమ్ ప్రోగ్రాంగా చేర్చాలన్నారు. ఎన్డీఏ వ్యతిరేక కూటమికి ఉద్యోగులు మద్దతుగా నిలుస్తారని అశోక్బాబు స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm