హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం ఐటీ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదు. ఆడిటర్స్ ద్వారా డాక్యుమెంట్లను అందిస్తానని చెప్పారు. అలాగే రేవంత్రెడ్డి విచారణకు హాజరుకాలేదని ఐటీ అధికారులు తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తులు, డొల్ల కంపెనీల లావాదేవీలపై ఐటీ అధికారులు రేవంత్ రెడ్డిని ఇప్పటికే రెండు సార్లు విచారించిన సంగతి తెలిసిందే. ఇవాళ మరోసారి విచారణకు రావాల్సిందిగా చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి విచారణకు హాజరుకాలేదు.
Mon Jan 19, 2015 06:51 pm