కామారెడ్డి : ఆటోను ఆర్టిసి బస్సు ఢీకొన్న సంఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. లింగంపేట మండలం పర్మాల వద్ద మంగళవారం ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. వారికి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm