ఛత్తీస్గఢ్: నారాయణపూర్ జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జరిగాయి. కోడెనార్ - తొగ్గు గ్రామాల సరిహద్దు ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. దుర్గేడు -బక్కూరు గ్రామాల సరిహద్దులో ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో మావోయిస్టులు తప్పించుకుని పారిపోయారు. ఘటనా స్థలం నుంచి 305 రైఫిళ్లు 12, వంట సామాగ్రి, వారపత్రికలు, మందుగుండు సామాగ్రి ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. భద్రతా దళాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm