చిత్తూరు : రేణిగుంట మండలం రాళ్ల కాల్వ వంతెనపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. వేగంగా వచ్చిన లారీ బైక్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన సాయి, తేజలు చనిపోయారు. శవపరీక్ష నిమిత్తం వీరి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm