ఇబ్రహీంపట్టణం: ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీని ఇబ్రహీంపట్నంలో నిర్మించబోతున్నామని టీఆర్ఎస్ నేత కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్టణంలో టీఆర్ఎస్ నేత కేటీఆర్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ పాలమూరుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలు చెప్పారని విమర్శించారు. మహాకూటమి జుట్టు చంద్రబాబు చేతిలో ఉందని ఆయన ఆరోపించారు. ఒకవేళ మహాకూటమి అధికారంలోకి వస్తే రైతులకు అన్యాయం జరుగుతుందని కేటీఆర్ అన్నారు. రైతులెవ్వరూ కుంట భూమిని కూడా అమ్ముకోవద్దని ఆయన సూచించారు. తెలంగాణలో టీడీపీకి క్యాడర్ లేదని.. కాంగ్రెస్కు లీడర్లు లేరని ఆయన ఎద్దేవా చేశారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
Mon Jan 19, 2015 06:51 pm