బెంగళూరు: మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ కురువృద్ధుడు హెచ్డీ దేవెగౌడకు మరో గౌరవం దక్కింది. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం చేసిన సేవలకు గుర్తింపుగా.. ఆయన మహర్షి వాల్మీకి జయంతి అవార్డు అందుకోనున్నారు. బుధవారం వాల్మీకి జయంతి సందర్భంగా విధాన సౌధలో జరిగే ఓ కార్యక్రమంలో తన కుమారుడు, కర్ణాటక సీఎం కుమారస్వామి చేతుల మీదుగా దేవెగౌడ ఈ అవార్డు అందుకోవాల్సి ఉంది. అయితే ఆయన విదేశీ పర్యటనకు ముందుగానే షెడ్యూల్ ఖరారు కావడంతో ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదు. తాను లండన్ బయల్దేరే ముందే మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాల వేయననున్నట్టు దేవెగౌడ ట్విటర్ ద్వారా వెల్లడించారు.1933 మే 18న జన్మించిన దేవెగౌడ... 1996 జూన్ 1 నుంచి 1997 ఏప్రిల్ 21 వరకు భారత ప్రధానిగా సేవలందించారు. దీనికి ముందు 1994 నుంచి 1996 వరకు కర్ణాటక 14వ ముఖ్యమంత్రిగా కొనసాగారు.
Mon Jan 19, 2015 06:51 pm