నల్గొండ: మిర్యాలగూడలో రసవత్తర రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ అసమ్మతి నేత అమరేందర్ రెడ్డి.. ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బుధవారం కుంతియా, ఉత్తమ్, జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరతానని అమరేందర్ రెడ్డి ప్రకటించారు. కాగా, అమరేందర్ రెడ్డి చేరికను స్థానిక కాంగ్రెస్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అసమ్మతి నేతలంతా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అమరేందర్ రెడ్డిని చేర్చుకుంటే సహకరించేంది లేదంటూ తీర్మానం చేశారు. ఆ తీర్మానం సందేశాన్ని పార్టీ నాయకత్వానికి పంపించారు.
Mon Jan 19, 2015 06:51 pm