విశాఖపట్నం: బుధవారం ఇరు జట్ల మధ్య విశాఖపట్నంలో రెండో వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మేనేజ్మెంట్ 12 సభ్యుల జట్టును మంగళవారమే ప్రకటించింది. జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా తొలి వన్డేకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లే వైజాగ్ వన్డేలో ఆడతారని తెలిపింది. తొలి వన్డేలో అవకాశం వచ్చిన ఆటగాళ్లంతా మెరుగైన ప్రదర్శన చేయడంతో జట్టు కూర్పులో మార్పులు చేయకూడదని నిర్ణయించింది. విన్నింగ్ కాంబినేషన్ను తర్వాతి వన్డేలకు కొనసాగించాలని భావిస్తున్నట్లు పేర్కొంది. తుది జట్టును భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ సమయంలో వెల్లడించనున్నాడు. 5వన్డేల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm