హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ ను కలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిత్లీ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ఉత్తరాంధ్ర జిల్లాలను ఆదుకోవాలని కోరారు. గవర్నర్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ తిత్లీ తుఫాన్ ప్రభావంపై ఆడియో-వీడియో ప్రజెంటేషన్ ఇచ్చామని బాధితులను ఆదుకోవాలని కోరామని చెప్పారు. తిత్లీ తుఫాన్ ను జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణమే కేంద్రం తుఫాన్ బాధితులను ఆదుకోవాలని కోరామని చెప్పారు. కేంద్రం సాయం తక్షణమే అందేలా చూడాలని గవర్నరుకు వినతిపత్రం అందించామని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm