ముంబయి: సినీ రచయితలకు సరైన పారితోషికం ఇవ్వాలని ప్రముఖ దర్శకుడు రాజ్కుమార్ హిరాణీ అన్నారు. సంజు సినిమాతో ఇటీవల మంచి హిట్ అందుకున్న హిరాణీ మంచి రచయితగానూ గుర్తింపు పొందారు. తాజాగా ఆయన రచయితలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. ఆర్థికంగా రచయితకు ఇంకాస్త గౌరవం ఇవ్వాలి. ప్రతి సినిమాకు వారే పునాది. ఇప్పుడు మీ సినిమా కోసం పనిచేసిన రచయితకు సరైన పారితోషికం ఇవ్వకపోతే.. ఇకపై మంచి రచయితలు వెతికినా దొరకరు. ఇది రచయితలకు చాలా పెద్ద సమస్య. ప్రస్తుతం రచయితలు ఒకేసారి నాలుగు స్క్రిప్టులు రాస్తున్నారు. ఏ కథ ముందుగా పూర్తవుతుంది, ఏ కథను ఓకే చేస్తారో వారికే తెలియదు. భవిష్యత్తులో మన దేశంలో ఎక్కువ మంది స్క్రిప్టులు రాయాలని, ఇప్పటి కంటే మంచి సినిమాలు రావాలని ఆశిస్తున్నా.
Mon Jan 19, 2015 06:51 pm