ముంబయి: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. మంగళవారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.130 పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,350 ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.32,200 గా ఉంది. మరోవైపు వెండి ధర రూ.250 పెరిగడంతొ కిలో వెండి ధర రూ.39,750 వద్ద నిలిచింది.అంతర్జాతీయంగాను బంగారం ధరలు పెరిగాయి. సౌదీ అరేబియా, పాశ్యాత్య దేశాల్లో నెలకొన్న రాజకీయ వివాదా లు, బ్రెక్సిట్ చర్చల ఫలితంగా ఔన్సు బంగారం ధర 0.2 శాతం మేర పెరిగింది. దీంతో ఔన్సు బంగారం ధర వి1,223.66 వద్ద నిలిచింది.
Mon Jan 19, 2015 06:51 pm