రాజస్థాన్: లో జికా వైరస్ విజృంభిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం 120 మందికి ఈ వైరస్ సోకినట్లు ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వెల్లడించారు. వైరస్ సోకడంపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
సరైన వైద్యం అందితే జికా వైరస్ బారి నుంచి వారం రోజుల్లో బయటపడవచ్చని వైద్య నిపుణులు తెలిపారు. తగిన విశ్రాంతి, ఎక్కువ నీరు తాగడం, సమయానికి వైద్యులు సూచించిన మందులు తీసుకుంటే ప్రమాదమేమీ ఉండదని చెప్పారు. ఈ వైరస్ వ్యాప్తి చేసే దోమ కేవలం పగలు మాత్రమే కుడుతుందని, కాబట్టి దోమలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జికా వైరస్ సోకితే జ్వరం, ఆయాసం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, కండ్లకలక వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. గర్భిణీలకు వైరస్ సోకకుండా జాగ్రత్తపడాలని, ఒకవేళ వారు జికా బారిన పడితే పుట్టబోయే పిల్లలు అంగవైకల్యంతో జన్మించే అవకాశముందని వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో వారికి గర్భస్రావం, ప్రసవం ముందుగానే జరగడం వంటి సమస్యలు ఉండొచ్చని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 23,2018 06:24PM