బెంగళూర్: కర్నాటకలో రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యంపై కర్నాటక పొల్యుషన్ కంట్రోల్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదని సీరియస్ అయ్యింది. రాష్ర్టంలో ఉన్న గ్రాఫైట్ ఇండియా లిమిటెడ్ (జీఐఎల్)వల్ల భారీ స్థాయిలో కాలుష్యం జరుగుతుండటంతో సుప్రీం కోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. వెంటనే జీఐఎల్ను మూసివేయాలని జస్టీస్ మదన్ బీ లోకుర్, దీపక్ గుప్తాలతో కూడిన బెంచ్ తీర్పును వెల్లడించింది.