హైదరాబాద్: వరం మాధవి సమర్పణలో శ్రీ శ్రీ శ్రీ శూలినీ దుర్గా ప్రొడక్షన్స్ బ్యానర్పై ఆర్య, విశాల్, సంతానం, తమన్నా, భాను నటించిన చిత్రం "ఐశ్వర్యాభిమస్తు". ఎం.రాజేష్ దర్శకుడు. వరం జయంత్ కుమార్ నిర్మాత. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాు పూర్తి చేసుకుని ఈ నెల 26న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వరం జయంత్ కుమార్ మాట్లాడుతూౌాాడి.ఇమాన్ సంగీతం సమకూర్చిన మా చిత్రంలోని పాటలు ఇటీవల విడుదల చేశాం. అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సెన్సార్ పూర్తైంది. సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికెట్తో పాటు సినిమా బావుందంటూ ప్రశంసించారు. వారి కాంప్లిమెంట్స్తో సినిమా పై మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది. మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాం అన్నారు
Mon Jan 19, 2015 06:51 pm