ఖమ్మం: ప్రభుత్వ గిరిజన పాఠశాలలో దారుణం జరిగింది. విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి జోసఫ్ చనిపోవడం కలకలం రేపింది. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు సమాచారం. హాస్టల్ వార్డెన్ లేని సమయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒక సెల్ఫోన్ విషయంలో జరిగిన గొడవలో విద్యార్థులు కొట్టుకున్నట్టు సమాచారం. ఈ ఘటనలో జోసఫ్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడి... అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm