హైదరాబాద్: పద్మశ్రీ అవార్డు అందుకున్న చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా ఒక మూవీ రూపొందుతున్నది. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మాత డి సురేష్ బాబు కొత్త దర్శకుడితో తీస్తున్నాడు. ఈ చిత్రంలో కమెడియన్ ప్రియదర్శి లీడ్ రోల్ చేస్తున్నాడు. ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తున్న తొలి సినిమా ఇదే. చేనేత కార్మికులకు శ్రమ తగ్గించేలా ఒక కొత్త యంత్రాన్ని కనిపెట్టి జాతీయ స్థాయిలో పేరు సంపాదించాడు మల్లేశం. అందుకే అతడికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. అతడి కథను వాస్తవికంగా.. హృద్యంగా చూపించే ప్రయత్నం చేస్తోందట చిత్ర బృందం. షూటింగ్ అంతా కూడా రియల్ లొకేషన్లలోనే చేస్తున్నారట.
Mon Jan 19, 2015 06:51 pm