తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం, టైంస్లాట్, నడక, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 3 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు శ్రీవారిని 51,062 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి నేటి హుండీ ఆదాయం రూ.3.52కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm