జమ్మూ: విధిరాత అంటే ఇదేనేమో.. పిల్లల కోసం 10 ఏళ్లుగా పరితపించిన ఓ జవాన్.. తన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను చూడకుండానే కన్నుమూసాడు. గత ఆదివారం పాకిస్తాన్ చొరబాటుదారుల కాల్పుల్లో చనిపోయిన జవాన్ రంజీత్ సింగ్ భూత్యాల్ సతీమణి అతని అంత్యక్రియల ముందే పండటి బిడ్డకు జన్మనిచ్చింది.
కూతురు పుట్టిందనే ఆనందం ఆ తల్లికి భర్త మరణంతో ఆవిరైంది. బరువెక్కిన గుండెతో అప్పుడే పుట్టిన తన కూతురుని తీసుకొని అంబులెన్స్ సహాయంతో భర్త అంత్యక్రియలకు హాజరైంది. అధికార లాంఛనాలతో ఆ జవాన్ చివరి కార్యక్రమాలు పూర్తయ్యాయి. సోమవారం రాత్రి పురిటి నొప్పులతో ప్రసూతి గదిలోకి వెళ్లిన ఆమె మంగళవారం ఉదయం 5 గంటలకు ఆడపిల్లకు జన్మనిచ్చిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. 2003లో భారత సైన్యంలో చేరిన రంజీత్ సింగ్ తన భార్య ప్రసవం కోసం సెలవులు తీసుకుంటానని చెప్పాడని, కానీ ఇంతలోనే ఈ దారుణం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సెలవు తీసుకున్న బతికేవాడని కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు ఆ వీర జవాన్ భార్య మాత్రం తన కూతురుని కూడా ఆమె తండ్రిలానే పెంచి సైన్యంలో చేరుస్తానని స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 23,2018 08:46PM