హైదరాబాద్: తెలంగాణ పోలీసులు, రాష్ట్ర ఎన్నికల అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 31 జిల్లాల ఎస్పీలు, డీజీఓలు పాల్గొనగా రాష్ట్ర ఎన్నికల అధికారులు కూడా పాల్గొన్నారు. ఐదు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వికారాబాద్ జిల్లాలకు అదనపు బలగాలను కోరారు. సమస్యాత్మక ప్రాంతాలు పెరగడంపై కేంద్ర ఎన్నికల సంఘం అసహనం వహించగా బూత్ లు, పోలింగ్ కేంద్రాల వారీగా ఆరాతీసింది. అదనపు బలగాలను పంపిస్తామని అందరూ నీతిగా, నిజాయతీగా పనిచేయాలని సీఈసీ రావత్ సూచించారు. వీవీప్యాట్ లలో లోపాలను కూడా సీఈసీ ద్రుష్టికి తీసుకెళ్లగా మరోసారి హైదరాబాద్ వస్తామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm