హైదరాబాద్: తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్, పోలీసులతో ముమ్మర తనిఖీలు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజు ఎక్కడోచోట కోట్ల డబ్బు బయటపడుతుంది. తాజాగా నగరంలో విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులకు 49లక్షల నగదు దొరికింది. అబిడ్స్ లో 35లక్షలు, సుల్తాన్ బజార్ లో 14లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అబిడ్స్ నగదు సునీల్ శర్మ అనే వ్యాపారి ఇన్నోవా కారులో తరలిస్తుండగా పట్టుకోగా.. సుల్తాన్ బజార్ నగదు మరో వ్యాపారి తరలిస్తుండగా పట్టుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm