ఇస్తాంబుల్: సౌదీ అరేబియాకు చెందిన జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్య తీరు తెలిస్తే ప్రొఫెషనల్ కిల్లర్లు కూడా అవాక్కవుతారు. హత్య చేసిన వెంటనే నిమిషాల వ్యవధిలో మృతదేహాన్ని ముక్కలు చేసి తరలించేసినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం వెలువరించింది. అక్టోబర్ 2వ తేదీన జమాల్ ఖషోగ్గి ఇస్తాంబుల్లోని సౌదీ అరేబియా దౌత్యకార్యాలయానికి వెళ్లారు. ఆయన కార్యాలయంలో అడుగుపెట్టిన రెండో నిమిషమే అతనిపై దాడి జరిగింది. ఆ తర్వాత ఖషోగ్గి సౌదీకి తిరిగి వచ్చేలా ఒప్పంచే క్రమంలో గొంతు నులిమారు. దీంతో ఖషోగ్గి ప్రాణాలు వదిలారు. తొలి ఏడు నిమిషాల వ్యవధిలోనే ఇదంతా జరిగిపోయింది. అనంతరం మరో 22 నిమిషాల్లో హంతకుల బృందం ఆయన మృతదేహాన్ని ముక్కలు చేసి తరలించేసిందని ఆ పత్రిక పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 23,2018 09:15PM