నల్లబెల్లి: ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు మనస్థాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని రుద్రగూడెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వైనాల రమక్క-సాంబయ్యల కుమారడు వైనాల సురేష్(22) అనే యువకుడు గత కొద్ది కాలంగా ఇదే మండలానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు తల్లి దండ్రులు తెలిపారని అన్నారు. అయితే అమ్మాయి మోసం చేసిందని సురేష్ తన అమ్మమ్మ ఇంట్లో ప్యానుకు చీరతో ఉరి చేసుకొని మృతి చెందినట్లు తల్లీదండ్రులు తెలిపారు.మృతుడి తల్లీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm