అమరావతి: తిత్లీ తుపాను ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసింది. అక్కడి ప్రజలను ఆదుకోవడానికి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. ఈ క్రమంలో కథానాయకుడు రాజశేఖర్ తనవంతు సహాయం చేస్తున్నట్లు మంగళవారం తెలిపారు. ఆయన సతీమణి జీవితతో కలిసి తుపాన్ బాధితులకు రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలుసుకొని రూ.10 లక్షల చెక్ను అందజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm