ఆసిఫాబాద్: మండలం అప్పపల్లికి చెందిన తల్లీబిడ్డలు ఇందిర (38), లావణ్య (17) మంగళవారం పిడుగుపాటుకు మృతి చెందారు. పొలం పనులకు వెళ్లిన తల్లీబిడ్డలు నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వస్తుండగా, ఒక్కసారిగా ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. పిడుగుపడడంతో తల్లీబిడ్డలకు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. లావణ్య జిల్లా కేంద్రంలోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm