హైదరాబాద్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్ ప్రచార ఊరేగింపులో డప్పు కొడుతూ కళాకారుడు మృతి చెందాడు. ఇల్లంతకుంట మండలంలోని తాళ్లల్లపల్లె, రేపాక, సోమవారం పేట, గొల్లపల్లె, వెంకట్రావుపల్లె, వెంకటాపూర్, తిప్పాపూర్ గ్రామాల్లో రసమయి ప్రచారాన్ని నిర్వహించారు. తిప్పాపూర్లో రసమయి స్వాగతానికి, ఉరేగింపునకు టీఆర్ఎస్ నాయకులు డప్పు కళాకారులను ఏర్పాటు చేశారు. ఊరేగింపులో అదే గ్రామానికి చెందిన దమ్మని నర్సయ్య(65) డప్పుకొడుతూ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే నర్సయ్యను మండలకేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm