హైదరాబాద్ : స్వల్ప విషయమై ఇద్దరు గొడవకు దిగగా.. గొడవ ఎందుకు అన్న పాపానికి యువకుడిని కత్తులతో పొడిచి అతిదారుణంగా చంపారు. ఈ సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ ప్రకాశ్రెడ్డి వివరాలు వెల్లడించారు. పాతబస్తీ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్గా ఉన్న షానూర్ ఘాజీ శాస్త్రీపురంలోని ముస్తఫానగర్లో తన అనుచరులతో కలిసి ఓ పాన్ షాప్ వద్ద ఉన్నాడు. రాత్రి 10.30 గంటల సమయంలో రౌడీ మామూళ్లు వసూలు చేస్తూ గొడవ పడుతున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ముస్తాక్(20) వారిని గొడవ వద్దని చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన రౌడీ షీటర్ షానూర్ తన అనుచరులతో కలిసి అతనిపై కత్తులతో దాడి చేశారు.
విషయం తెలుసుకున్న మైలార్దేవ్పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కత్తిపోట్లకు గురైన ముస్తాక్ను చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించేలోపే మార్గ మధ్యలో మృతి చెందాడు. కాగా.. ఇంతటి దారుణానికి పాల్పడిన రౌడీ షీటర్ షానూర్తో పాటు అతని అనుచరులైన ఫర్హాన్, అబ్దుల్ అల్తాఫ్, మహ్మద్ అర్బాస్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అఫ్రోజ్, సమద్తో పాటు జలమండలి ఉద్యోగి ముగ్గురు పరారీలో ఉన్నట్లు డీసీపీ ప్రకాశ్రెడ్డి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 17,2018 08:25AM