హైదరాబాద్ : నకిలీ పత్తి విత్తనాలు విక్రయించిన ముగ్గురు వ్యాపారులను మేడ్చల్ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు వ్యవసాయాధికారులతో కలిసి పోలీసులు దాడులు చేశారు. వెన్నెల విత్తనాల కంపెనీ నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నారని సంపతి ఆంజనేయులు, మామిళ్ల మహేందర్, శేషయ్యలను అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు రిమాండుకు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm