హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో భాగంగా ప్రచారం చేసేందుకు సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకరత్ ఈనెల 21న రాష్ట్రానికి రానున్నారు. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహ్మారెడ్డి, టి జ్యోతి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 21న వైరా, మధిక నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. ఈనెల 22న భద్రాచలంలో నియోజకవర్గంలో పర్యటిస్తారని పేర్కొన్నారు. శనివారం రాష్ట్రానికి సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు వస్తారని తెలిపారు. శనివారం ఉదయం కామారెడ్డి, మధ్యాహ్నం సంగారెడ్డి నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామినేషన్ దాఖలు ప్రక్రియలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి 29వ తేదీ వరకు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు కె హేమలత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. ఈనెల 25న ఉదయం ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూరులో, సాయంత్రం మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తారని పేర్కొన్నారు. ఈనెల 26న ఉదయం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో, రామగుండంలో బహిరంగసభలో పాల్గొంటారని తెలిపారు. ఈనెల 28న ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటిస్తారని పేర్కొన్నారు. ఈనెల 29న ఉదయం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నండూరి ప్రసాదరావు వర్ధంతి సభలో ఎన్నికలు-ప్రత్యామ్నాయంఃఅనే అంశంపై ప్రసంగిస్తారని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm