భద్రాచలం: ముఖ్యమంత్రి పదవీ కాలం ఎనిమిది నెలలుండగానే ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను, అసంతృప్తిని గమనించి ఓటమి భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని, ఈ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టు చర్ల శబరి ఏరియా కమిటీ కార్యదర్శి శారద ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఆదివాసీలకు మూడెకరాల భూమి వాగ్దానం మూలనపడిందన్నారు. డబుల్బెడ్రూం ఇండ్లు పేరుకే మిగిలాయని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎనిమిది మండలాలను ఫణంగా పెట్టి కేసీఆర్ ప్రభుత్వం ఆదివాసీలను సమాధి చేస్తున్నదన్నారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక సీఆర్పీఎఫ్ పోలీసు క్యాంపును ఏర్పరచి ఆ ప్రాంతంలోని ఆదివాసీ గ్రామాలపై నిత్యం దాడులు చేస్తూ ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు.
Mon Jan 19, 2015 06:51 pm