హైదరాబాద్: బాగ్లింగంపల్లిలోని పలు బస్తీల్లో మహాకూటమి ముషీరాబాద్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. ఓ మటన్ షాప్లో ఇలా మటన్ కొడుతూ ఓట్లు వేయాలని కోరారు. నాలుగున్నరేళ్ల టిఆర్ఎస్ పాలనతో ప్రజలు విసుగు చెందారని, నిరుద్యోగ యువత ప్రశ్న న్యాయ పాలన వైపు ఆలోచిస్తున్నారని తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ గ్రేటర్ కార్యదర్శి అంజి యాదవ్, రాం నగర్ మాజీ కార్పొరేటర్ కల్పనా యాదవ్, ఎం ఎస్ యు వై నగర ప్రధాన కార్యదర్శి సంఘ పాక.వెంకట్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm