హైదరాబాద్: సమాజంలో స్త్రీలు ఉన్నతమైన పాత్రను పోషించాలని నందమూరి కుటుంబం నమ్ముతుందని ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణలోని కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తున్న తమ సోదరి సుహాసినిని విజయం వరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఇద్దరు హీరోలు ట్విట్టర్ లో స్పందించారు. 'ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్న అక్క సుహాసినికి ఆల్ ది బెస్ట్' అని ఎన్టీఆర్ ట్వీట్ చేయగా, 'సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన సుహాసిని అక్కకు ఆల్ ది బెస్ట్' అని కల్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm