హైదరాబాద్ : ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ఫలితాల మీద స్పందిస్తూ ఈరోజు ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో అయన టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఫలితం దక్కిందన్నారు. మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఓటమితో అయన అనుకున్నది సాధించానని.. ఉమ్మడి రంగారెడ్డి ప్రజలు మేలుతప్పక జరుగుతుందన్నారు. ఓ 33 ఏళ్ల యువకుడు రోహిత్ రెడ్డి ఓ బలమైన మంత్రిని ఓడించడం మామూలు విషయం కాదని రంగారెడ్డి జిల్లా, తాండూరు చరిత్రలో ఇదో కొత్త అధ్యాయం అని పరిణామాన్ని అందరూ ఆహ్వానిస్తున్నారన్నారు. రాష్ట్రమంతా వీచిన ఇంత పెద్ద వేవ్ లోనూ ఆ గెలుపు చిన్న విషయం కాదన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm