దుబాయ్: టెక్నాలజీ పుణ్యమా అని అనేక నూతన ఆవిష్కరణలు మానవ జీవితంలో భాగమవుతున్నాయి. దీంతో అనేక సేవలు సులభతరంగా మారిపోయాయి. ఇదివరకు బ్యాంకులు, స్టోర్లు, షాపింగ్ మాళ్లతోపాటు అనేక చోట్ల క్యూలు కట్టే వారంతా ఇంట్లో కూర్చుని మొబైల్ ద్వారా కావాల్సిన సేవలను పొందుతున్నారు. వేలాదిగా పుట్టుకొస్తున్న యాప్ల ద్వారా అనేక రకాల సేవలను సెల్ఫోన్ ద్వారానే పొందుతున్నారు. ఈ సేవల సరసన పెట్రోల్ కూడా వచ్చి చేరింది. యూఏఈలోని దుబాయ్ నగరంలో మొదటిసారిగా మొబైట్ పెట్రోల్ సర్వీస్ ను ప్రారంభించారు. 30 వేల లీటర్ల సామర్థ్యం గల ఓ ట్యాంకర్ సహాయంతో ఆర్డర్ ఇచ్చిన వ్యక్తుల ఇంటికే వెళ్లి వాహనాల్లో పెట్రోల్ను నింపనున్నారు. ప్రస్తుతానికి దుబాయ్ నగరంలో ఈ సర్వీస్ను పైలెట్ ప్రాజెక్ట్గా ప్రారంభించారు. దుబాయ్లో ఈ రకమైన సేవలు మొదటిసారని, మంచి స్పందన వస్తోందని నిర్వాహకులు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm