సంగారెడ్డి: గత ఎన్నికల్లో ఓడినా ప్రజల మధ్యనే ఉన్నానని, జవాబుదారీగా పని చేస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. రాజకీయంగా తనకు ప్రాణం పోశారని, కాంగ్రెస్ ప్రభుత్వం లేదని, ఉన్న ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇకపై రాజకీయ విమర్శలు చేయనని స్పష్టం చేశారు. 40 వేల ఇళ్ల స్థలాలు, మంజీరా నీరు, మౌళిక వసతుల కోసం కేసీఆర్ను కలుస్తానని తెలిపారు. ప్రభుత్వం సహకరించకుంటే ప్రజల్లోకి వెళ్లి వివరిస్తామన్నారు. ప్రభుత్వం తనపై కక్ష సాధించినా కాంగ్రెస్ను వీడనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కల్యాణలక్ష్మీ డబ్బులు పెళ్లికి ఒక రోజు ముందు ఇవ్వాలని సీఎంను కలుస్తానని, ఈ నెల 17న సంగారెడ్డిలో లక్ష మందితో కృతజ్ఞతా సభ నిర్వహిస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm