హైదరాబాద్ : కోస్తా ఆంధ్రాకు మరో వాయుగుండం ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. దీనిప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీనిప్రభావంతో ఈనెల 12 నుండి 14 వరకు కోస్తా జిల్లాలలో భారీ వర్గాలు కురిసే అవకాశంతో పాటు ఈదురు గాలులు వీచే అవవకాశం ఉంది. సముద్రంలో అలలు ఆరు మీటర్ల ఎత్తులో ఎగసిపడనున్నాయి. గంటకు డెబ్భై నుండి వంద కిలోమీటర్ల వేగంతో గాలులువీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్ర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లవద్దని ప్రభుత్వం సూచించింది.
Mon Jan 19, 2015 06:51 pm