హైదరాబాద్: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ వివాహ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు బయల్దేరారు. గన్నవరం విమనాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ముంబయికి చేరుకోనున్నారు. ఈశా అంబానీ- ఆనంద్ పిరమాల్ల వివాహానికి ఇప్పటికే ఘనంగా ఏర్పాట్లు చేశారు. ముంబయిలోని అంబానీ నివాసం యాంటీలియాలో ఈ రోజు రాత్రి వీరి వివాహం జరగనుంది. ఇందుకోసం యాంటీలియాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
Mon Jan 19, 2015 06:51 pm