హైదరాబాద్: తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలు(పిఎంటి, పిఇటి) వాయిదా పడ్డాయి. హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి(టిఎస్ఎల్ పిఆర్ బి) వెల్లడించింది. ఈ నెల 17వ తేదీ నుంచి జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే తదుపరి తేదీలను విడుదలచేస్తామని, ఈ పరీక్షలకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు డిసెంబర్ 15 అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని టిఎస్ఎల్ పిఆర్ బి ప్రకటన విడుదల చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm