హైదరాబాద్ : నిన్న ఎన్నికల ఫలితాలలో హాంగ్ లో చిక్కుకున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర సీఎంగా కమలనాధ్ పేరును ఖరారు చేశారు. 230 సీట్లు కలిగిన ఎంపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు 116 సీట్లు కావాల్సి ఉండగా కాంగ్రెస్ 114 స్థానాల్లో గెలిచింది. ఆ పార్టీకి మద్దతుగా నిలిచిన సమాజ్ వాదీ పార్టీ ఒక్క స్థానం గెలవడంతో మేజిక్ ఫిగర్ కు ఒక సీటు దూరంలో హస్తం పార్టీ ఆగిపోయింది. బీజేపీ 109 సీట్లలో గెలుపొందగా బీఎస్సీ 2, ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు మాయావతితో చర్చలు జరిపి తమకు మద్దతు కోరగా ఆమె అంగీకరించడంతో కాంగ్రెస్ కు లైన్ క్లియర్ అయింది. ఇక సీఎంగా ఎవరు అన్నదానిపై మధనం జరుగగా ఆఖరికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి కమల్ నాథ్ పేరును ఖరారైంది. కాంగ్రెస్ పార్టీ యువనేత జ్యోతిరాథిత్య సింధియా కమల్ నాధ్ పేరును ప్రతిపాదించారు.
Mon Jan 19, 2015 06:51 pm