న్యూఢిల్లీ: తాజాగా ఐదురాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మోదీ ఇంద్రజాలం అనేదీ ఏదీ లేదని రుజువు చేశాయని మాజీ బీజేపీ నాయకుడు యశ్వంత్ సిన్హా అన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ అదికారం చేపట్టడం మోదీ ప్రభ తగ్గిందని సూచిస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్తో అన్ని విపక్షాలు కలిసిమెలిసి పోటీచేస్తే మోదీ సర్కారును గద్దెద దించవచ్చని ఆయన సూచించారు. కాంగ్రెస్ ఇందులో పెద్దన్న ధోరణిలో వ్యవహరించకుండా ఉండాలని, ఎన్నికల తర్వాతే నాయకత్వం గురించి నిర్ణయించాలని చెప్పారు. వాజ్పేయి సర్కారులో మంత్రిగా పనిచేసిన సిన్హా ప్రధాని నరేంద్రమోదీతో విభేదాల వల్ల పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఎన్నికలకు ముదరే అన్నిపార్టీలు కూటమిని ఏర్పాటు చేయాలని, అది కుదరకపోతే ప్రాంతీయపార్టీలు కాంగ్రెస్తో అవగాహనతో ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. బెంగాల్లోని తృణమూల్ కాంగ్రస్తో తమిళనాడులోని డీఎంకేకు లేదా మరో ఇతర ప్రాంతీయపార్టీకి విభేదాలు ఉండవని ఆయన గుర్తుచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm