దుబాయ్: టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐసీసీ ఊహించని షాక్ ఇచ్చింది. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నప్పటికీ.. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్లో కోహ్లీ అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో 15 రేటింగ్ పాయింట్లు తగ్గినట్లు ఐసీసీ పేర్కొంది. ప్రస్తుతం కోహ్లీ 920 పాయింట్లతో టెస్ట్ ర్యాంకింగ్స్లో నెం.1 స్థానంలో ఉన్నారు. న్యూజిలాండ్ క్రికెటర్ విలియమ్సన్ 913 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. గత వారంలో అబుదాబిలో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ క్రికెటర్ విలియమ్సన్ భారీ స్థాయిలో పరుగులు చేయడంతో 37 రేటింగ్ పాయింట్లు సాధించారు. కోహ్లీ, విలియమ్సన్ 7 రేటింగ్ పాయింట్ల తేడా మాత్రమే ఉంది. ఈ 7 పాయింట్లను న్యూజిలాండ్ క్రికెటర్ అధికమిస్తే కోహ్లీ నెం.1 స్థానం పడిపోతుంది.
Mon Jan 19, 2015 06:51 pm