హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శశిథరూర్ బీజేపీ మీద తీవ్ర వ్యంగ్యస్త్రాలును సంధించారు. గత కొంతకాలంగా శశిథరూర్ ను తన భార్య సునంద పుష్కర్ మృతికి కారణంగా బీజేపీ వ్యక్తిగత దాడి విమర్శలు చేస్తుండగా నిన్న ఎన్నికల ఫలితాలతో శశిధరూర్ కు విమర్శల అస్త్రం దొరికింది. తాజాగా ట్విట్టర్లో స్పందించిన శశిథరూర్ బీజేపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉండిఉంటారు. ఓటర్లు వారికి ట్రిపుల్ తలాక్ చెప్పారు కదా అని ట్వీట్ చేశారు. ఇస్లాం మతస్థులు విడాకులు తీసుకునే ట్రిపుల్ తాలాక్ కు బదులు నూతన చట్టాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే కాగా దీనినే అయన వ్యంగ్యాస్త్రం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm