న్యూఢిల్లీ: కేంద్ర మాజీమంత్రి ఎంజే అక్బర్, తరుణ్ తేజ్ పాల్లను సస్పెండ్ చేస్తున్నట్లు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(ఈజీఐ) బుధవారం ప్రకటించింది. అక్బర్పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు పాత్రికేయ ప్రతిష్ఠను దెబ్బతీసేవిగా ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొంది. అక్బర్ తమను లైగింకంగా వేధించారని కొందరు మహిళా పాత్రికేయులు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చే వరకు ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ఈజీఐ తెలిపింది. అదే విధంగా తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు ఈజీఐ తెలిపింది. దీనిపై ఈజీఐ ప్రతినిధులు మాట్లాడుతూ... అక్బర్ విషయాన్ని ఎడిటర్స్ గిల్డ్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత్రికేయ వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేవిలా ఉన్నాయి. అక్బర్ను సస్పెండ్ చేయాలని చాలా మంది అధికారులు కోరుతున్నారు. కోర్టు అక్బర్ విషయంలో స్పష్టమైన తీర్పు ఇచ్చి, నిర్దోషని తేలేవరకు ఆయనను సస్పెండ్ చేస్తున్నాం అని తెలిపారు. అక్బర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయన తన కేంద్ర మంత్రి పదవికి కూడా ఇటీవల రాజీనామా చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 12,2018 08:50PM