హైదరాబాద్: తెలంగాణకు చంద్రబాబు వచ్చినట్టుగానే కేసీఆర్ సైతం ఆంధ్రప్రదేశ్కు వెళ్లి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినందుకు కేసీఆర్కు ఆయన ఇవాళ హైదరాబాద్లో శుభాకాంక్షలు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు సైతం గెలవాలని ఎప్పుడూ కోరుకోలేదని, కేసీఆర్ గెలుపునకు మాత్రం వివిధ దేవుళ్లకు మొక్కుకున్నట్టు తెలిపారు. గద్దర్ అంటే తనకు ఎంతో అభిమానమని, అలాంటి వ్యక్తి కాంగ్రెస్తో కలిసి ప్రచారం చేయడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. సెటిలర్లను సైతం తెలంగాణ బిడ్డలుగా కేసీఆర్ చూసుకున్నారని, 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్ అధికారంలోకి రావడం ఖాయమని అంచనా వేశారు.
Mon Jan 19, 2015 06:51 pm