వాషింగ్టన్: తమకు రాజకీయ వివక్ష వుందన్న ఆరోపణలను ఇంటర్నెట్ దిగ్గజ సంస్థ గూగుల్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సిఇఓ) సుందర్ పిచరు ఖండించారు. మంగళవారం నాడు ఆయన న్యాయవ్యవహారాల సభా సంఘం ముందు మాట్లాడుతూ ఏ దశలోనైనా రాజకీయ వివక్షను నివారించేందుకు తాము అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తామని చెప్పారు. తమ సంస్థ గూగుల్ సెర్చ్ ఇంజన్లు, ఇతర ఉత్పత్తులలో ఎటువంటి వివక్షకూ తావుండదన్నారు. వివక్షను ఏ రూపంలో అనుమతించినా అది తమ మౌలిక సూత్రాలకు, వ్యాపార ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఆయన అన్నారు. ఇంటర్నెట్లో తమ కార్యకలాపాలకు, ఉత్పత్తులకు ఎటువంటి రాజకీయ సెంటిమెంటూ వుండదన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm