హైదరాబాద్ : అసుస్ తన నూతన స్మార్ట్ఫోన్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం2 ను భారత మార్కెట్లో తాజాగా విడుదల చేసింది. ఇందులో 6.26 ఇంచుల భారీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ను అందిస్తున్నారు. వెనుక భాగంలో 12, 5 మెగాపిక్సల్ కెమెరా రెండు ఉండగా, ముందు భాగంలో 13 మెగాపిక్సల్ కెమెరా ఒకటి ఉంది. దీనికి ఫ్లాష్ సదుపాయం కల్పించారు. అలాగే ఫేస్ అన్లాక్ సదుపాయం కూడా సెల్ఫీ కెమెరాకు ఉంది. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లో డెడికేటెడ్ మెమొరీ కార్డు స్లాట్ను ఏర్పాటు చేశారు. డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈకి ఇందులో సపోర్ట్ను అందిస్తున్నారు. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని ఈ పోన్లో ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ను ఇచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm