హైదరాబాద్ : వైసీపీ నేతలు ఆంధ్రా ప్రతినిధులు కాదని.. కెసిఆర్ ఏజెంట్లని మండిపడ్డారు మంత్రి ఆదినారాయణ రెడ్డి. తెలంగాణలో తెరాస పార్టీ గెలిస్తే ఆంధ్రాలో వైసీపీ పార్టీ సిగ్గులేకుండా కేకులు కట్ చేసుకొని సంబరాలు చేసుకున్నారన్నారు. ఏపీకి హోదా ఇవ్వడానికి వీలులేదని వాదించిన తెరాస పార్టీ గెలుపు కోసం వైసీపీ నేతలు ప్రచారం చేశారని.. సోనియాగాంధీ తెలంగాణ ప్రచారం సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెబితే తెరాస నేతలు ఆమెను తిట్టి పోశారని.. అలాంటి పార్టీ గెలిస్తే వైసీపీకి ఎక్కడలేని ఉత్సాహం వచ్చిందన్నారు. ఏపీలో కెసిఆర్ ఏజెంట్లను ప్రజలు భరించాలా అని అయన ప్రశ్నించారు.
Mon Jan 19, 2015 06:51 pm