నేపిడా: మయన్మార్లో గత ఏడాది అరెస్టయిన రాయిటర్స్ వార్తా సంస్థ ఇద్దరు జర్నలిస్టులు వా లోన్, క్యాసోవూ లను వెంటనే విడుదల చేయాలని వారి కుటుంబ సభ్యులు, సహోద్యోగులు మయన్మార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం నాటికి వారిని అరెస్ట్ చేసి ఏడాది పూర్తయిన సందర్భంలో వారు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. వీరిద్దరికీ ఈ వారంలో టైమ్ మ్యాగజైన్ పర్సన్స్ ఆఫ్ది ఇయర్ పురస్కారాలను ప్రకటించారు. వారు మయన్మార్లో రోహింగ్యా సంక్షోభానికి సంబంధించిన వార్తా సేకరణ సమయంలో అక్కడి అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ భద్రతా దళాలు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసు మయన్మార్లో పత్రికా స్వేచ్ఛను ప్రశ్నార్థకంగా మార్చింది. ఈ ఇద్దరు జర్నలిస్టుల విడుదల కోరుతూ మద్దతుదారులు బుధవారం నాడు యాంగాన్లో భారీ ప్రదర్శన నిర్వహించారు.
Mon Jan 19, 2015 06:51 pm