హైదరాబాద్ : ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షకు ఈ నెల 17 నుంచి హాల్టికెట్లు జారీ చేయనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటించింది. ఈ ఏడాది నుంచి తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్న ఈ పరీక్షను జనవరి 6 నుంచి 20 వరకు ప్రతి రోజు రెండు షిఫ్టులవారీగా నిర్వహించనున్నారు. మొదటి షిఫ్టును ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు, రెండో షిఫ్టును మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణకు ఏపీలో 18 నగరాలు, తెలంగాణలో 7 నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక విద్యార్థుల సందేహాల నివృత్తికి 7042399520, 7042399521, 7042399526 ఫోన్ నంబర్లతో ప్రత్యేక కాల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ ప్రకటించింది.
వారంలో ఫీజుల నోటిఫికేషన్
ఇంజనీరింగ్తో పాటు పలు వృత్తి విద్యా కోర్సుల ఫీజులు నిర్ణయించడానికి సంబంధించి ఈ వారంలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 13,2018 06:04AM