హైదరాబాద్ : నగరంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. నాలుగురోజులుగా చలి తీవ్రత తగ్గడంతో పాటు పగటి ఉష్ణోగ్రతలు 31-32 డిగ్రీలకు చేరడంతో ఉక్క పోత పెరిగింది. సాధారణం కంటే పగలు, రాత్రి 2-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. మరో నాలుగురోజుల పాటు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని బేగంపే ట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం గరిష్ఠం - 31.2, కనిష్ఠం-19.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు గాలిలో తేమ శాతం తగ్గడంతో ఉష్ణోగ్రతల ప్రభావం అధికంగా కనిపిస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm